CRIME

సీఎం ఆదేశాలతో బుల్డోజర్లతో వనతార రిసార్టును కూల్చేసిన అధికారులు

అమరావతి: అంకితా భండారి (19) హత్య కేసు విషయంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్రంగా స్పందించారు. వనతార రిసార్ట్‌ ను కూల్చేయాలని సీఎం ఆదేశించడంతో,అధికారులు బుల్డోజర్లతో పుల్కిత్ ఆర్యకు చెందిన రిసార్టును కూల్చేశారు.వివరాల్లోక వెళ్లితే… పుల్కిత్ ఆర్య ఉత్తరాఖండ్ మాజీ మంత్రి  వినోద్ ఆర్య కుమారుడు. రిషికేశ్‌లో వనతార పేరుతో రిసార్ట్‌ నడుపుతున్నాడు..అందులో అంకితా భండారి రిసెప్షనిస్టుగా పని చేస్తొంది. సెప్టెంబర్ 18వ తేదీన సాయంత్రం 6 గంటలు అయిన ఆమె ఇంటికి రాకపొవడంతో,అంకిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్యను,మేనేజర్,అకౌంటెంట్ ను అరెస్ట్ చేశారు.తొలుత కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన పుల్కిత్ ఆర్యను, పొలీసులు తమదైన శైలీలో విచారించగా, ఓ వివాదం కారణంగా అంకితా భండారికి మద్యం తాగించి,చిల్లా కాలువలోకి తోసేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి సెర్చ్ ఆపరేషన్  మొదలుపెట్టిన SDRF బృందాలు అంకితా భండారి మృతదేహన్ని బయటకు తీశారు. ఆ తర్వాత డెడ్ బాడీని రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు.

రాష్ట్రంలోని అన్ని రిసార్ట్‌ ల నిర్వాహకులను విచారించాలని జిల్లా మేజిస్ట్రేట్‌లకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. అక్రమంగా నిర్వహిస్తున్న రిసార్ట్‌లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కేసులో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి రేణుకాదేవి ఆధ్వర్యంలో సిట్ ను ఏర్పాటు చేసినట్లుగా సీఎం వెల్లడించారు.

Spread the love
venkat seelam

Recent Posts

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

12 hours ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

13 hours ago

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

15 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్న20 వేల మందికి పైగా ఉద్యోగులు-కలెక్టర్

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…

15 hours ago

బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్

అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…

16 hours ago

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

1 day ago

This website uses cookies.