NATIONAL

భగత్‌సింగ్‌ పేరును చంఢీగఢ్‌ విమానాశ్రయానికి పెడుతున్నట్లు ప్రకటించిన ప్రధాని మోదీ

అమరావతి: చంఢీగడ్ విమానశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ పేరును చంఢీగఢ్‌ విమానాశ్రయానికి పెడుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదివారం నిర్వహించిన మన్ కీ బాత్ ప్రసంగంలో స్వయంగా వెల్లడించారు. భగత్‌సింగ్‌ జయంతి వేళ ఆయనకు నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నరేంద్రమోదీ తెలిపారు. వాతావరణ మార్పులు, ఇటీవల భారత్‌కు తీసుకువచ్చిన చీతాలు వంటి విషయాలను ప్రముఖంగా ప్రస్తావించారు. సెప్టెంబర్‌ 28న భగత్‌సింగ్‌ జయంతి జరుపుకోనున్న వేళ సమరయోధుడికి నివాళిగా చంఢీగఢ్‌ ఎయిర్‌పోర్టుకు ఆయన పేరు పెడుతున్నట్లు ప్రకటించారు.సముద్ర తీర ప్రాంతాలకు వాతావరణ మార్పులు పెను సవాలుగా మారాయని, బీచ్‌లలో చెత్త పేరుకుపోవడం కలవరపెడుతున్న విషయమన్నారు. ఇలాంటి తీవ్ర సవాళ్లను మనందరి బాధ్యతగా కలిసికట్టుగా ఎదుర్కోవాలని సూచించారు. సుదీర్ఘ కాలం తర్వాత దేశంలోకి చీతాలు రావడంపై దేశవ్యాప్తంగా ఎంతోమంది సంతోషం వ్యక్తం చేశారని, చీతాలను ఎప్పటినుంచి చూడవచ్చు అనే విషయంపై, వాటిని పర్యవేక్షిస్తోన్న టాస్క్‌ ఫోర్స్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీజేపీ సిద్ధాంతకర్త దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ్‌ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. రాబోయే పండుగల సందర్భంగా ప్రజలు స్థానికంగా తయారుచేసిన నాన్ ప్లాస్టిక్ సంచులను వాడాలని సూచించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో, భగత్ సింగ్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 28ని ప్రత్యేక దినోత్సవంగా నిర్వహించుకోవాలని సూచించారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

1 hour ago

నా కుమారై, నన్ను వ్యతిరేకించడమా ? ముద్రగడ పద్మనాభరెడ్డి

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…

7 hours ago

వయనాడ్‌లో ఓడిపోతే ? రాయ్‌బరేలి నుంచి బరిలోకి దిగిన రాహుల్‌ గాంధీ

అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులపై కొనసాగుతున్న…

7 hours ago

వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి

అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…

1 day ago

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

1 day ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

2 days ago

This website uses cookies.