AMARAVATHI

పరిశ్రమల అవసరాలకు మిగులునీటి సరఫరా చెయుటకు ప్రణాళికలు సిద్ధం చేయండి- కమిషనర్ వికాస్

నెల్లూరు: కృష్ణపట్నం పోర్టు అదానీ గ్రూపు, ఇతర పరిశ్రమల అవసరాలకు నెల్లూరు నగర పాలక సంస్థ నుంచి మిగులు మంచినీటిని సరఫరా చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులను ఆదేశించారు. ముత్తుకూరులోని కృష్ణపట్నం పోర్టు అదానీ గ్రూపు, ఇతర ఆయిల్ పరిశ్రమల ప్రతినిధులు, పబ్లిక్ హెల్త్ అధికారులు, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమావేశాన్ని కమిషనర్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జాతీయ హరిత ట్రిబ్యునల్ మార్గనిర్దేశాలను అనుసరించి నగర పాలక సంస్థ పరిధిలో భూగర్భ జలాలకు అనుగుణంగా ప్రాజెక్టు రిపోర్టును రూపొందించాలని కమిషనర్ సూచించారు.పరిశ్రమల నిర్వహణకు ప్రతిరోజూ అవసరమైన నీటి సరఫరా అంచనాలను తెలుసుకుని తదనుగుణంగా నగరంనుంచి ముత్తుకూరులోని పరిశ్రమలకు నీటిని అందించేందుకు ప్రణాళికలను రూపొందించాలని కమిషనర్ ఆదేశించారు. పరిశ్రమలలో మౌళిక సదుపాయాల కల్పనతో ఉత్పాదకత పెరగడంతో పాటు నూతన పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహంగా ఉంటుందని కమిషనర్ వెల్లడించారు. పరిశ్రమల అభివృద్ధితో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు నగరాభివృద్ధి వేగవంతమవుతుందని కమిషనర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ ఎస్.ఈ సంపత్ కుమార్, ఈ.ఈ సంజయ్, డి.ఈలు, పబ్లిక్ హెల్త్ ఈ.ఈలు, డి.ఈలు, ఏ.ఈలు, కృష్ణపట్నం పోర్టు, ఇతర పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

14 hours ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

14 hours ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

2 days ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

2 days ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

2 days ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

2 days ago

This website uses cookies.