కీలక పరిణామం..
అమరావతి: చంద్రయాన్-3 మిషన్ ప్రాజెక్టులో భాగమైన కీలక పరిణామం నేడు జరిగింది..చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా విడిపోయినట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి..ఈ ల్యాండర్ 23 లేదా 24వ తేదీన చంద్రుడి ఉపరితలంపై దిగనున్నట్లు అంచనా వేస్తున్నారు..చంద్రయాన్-3 ప్రాజెక్టులో ఓ కీలక ఘట్టం ముగియడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. శుక్రవారం సాయంత్రం దాదాపు 4 గంటలకు ల్యాండర్ విక్రమ్,,చంద్రుడి ఉపరితలానికి మరింత చేరువకానున్నట్లు ఇస్రో తెలిపింది.. ల్యాండర్ మాడ్యూల్ వేరు అయిన అనంతరం అతి కీలకమైన ఘటంగా భావించేది స్పేస్క్రాఫ్ట్ వేగం..ఈ వేగం తగ్గించే ప్రక్రియను ఇస్రో చేపట్టనున్నది.. అనంతరం స్పేస్ క్రాఫ్ట్ ను చంద్రుడికి అతి దగ్గరి ప్రదేశమైన పెరిలూన్ (చంద్రుడి ఉపరితలం నుంచి 30 కి.మీ దూరం), అపోలూన్ (చంద్రుడి ఉపరితలం నుంచి 100 కి.మీ దూరం) కక్ష్యలోకి ప్రవేశపెడతారు.. అనంతరం హరిజెంటల్ గా ఉన్న స్పేస్ క్రాఫ్ట్ ను వర్టికల్ దిశగా మార్చే ప్రక్రియను చేపడతారు..ఇదే కక్ష్య నుంచి ఆగస్టు 23వ తేది తెల్లవారుజామున విక్రమ్ ను సాఫ్ట్ ల్యాండింగ్ ను చేయనున్నారు..
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.