ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపొయిన విక్రమ్ ల్యాండర్
కీలక పరిణామం..
అమరావతి: చంద్రయాన్-3 మిషన్ ప్రాజెక్టులో భాగమైన కీలక పరిణామం నేడు జరిగింది..చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా విడిపోయినట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి..ఈ ల్యాండర్ 23 లేదా 24వ తేదీన చంద్రుడి ఉపరితలంపై దిగనున్నట్లు అంచనా వేస్తున్నారు..చంద్రయాన్-3 ప్రాజెక్టులో ఓ కీలక ఘట్టం ముగియడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. శుక్రవారం సాయంత్రం దాదాపు 4 గంటలకు ల్యాండర్ విక్రమ్,,చంద్రుడి ఉపరితలానికి మరింత చేరువకానున్నట్లు ఇస్రో తెలిపింది.. ల్యాండర్ మాడ్యూల్ వేరు అయిన అనంతరం అతి కీలకమైన ఘటంగా భావించేది స్పేస్క్రాఫ్ట్ వేగం..ఈ వేగం తగ్గించే ప్రక్రియను ఇస్రో చేపట్టనున్నది.. అనంతరం స్పేస్ క్రాఫ్ట్ ను చంద్రుడికి అతి దగ్గరి ప్రదేశమైన పెరిలూన్ (చంద్రుడి ఉపరితలం నుంచి 30 కి.మీ దూరం), అపోలూన్ (చంద్రుడి ఉపరితలం నుంచి 100 కి.మీ దూరం) కక్ష్యలోకి ప్రవేశపెడతారు.. అనంతరం హరిజెంటల్ గా ఉన్న స్పేస్ క్రాఫ్ట్ ను వర్టికల్ దిశగా మార్చే ప్రక్రియను చేపడతారు..ఇదే కక్ష్య నుంచి ఆగస్టు 23వ తేది తెల్లవారుజామున విక్రమ్ ను సాఫ్ట్ ల్యాండింగ్ ను చేయనున్నారు..