అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ ప్రాంతంలో రెండు రోజుల పాటు ప్రధాని పర్యాటన కొనసాగుతుంది. ప్రధాని మోడీ రాకతో కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సుమారు రెండు క్వింటాళ్ల పూలతో సుందరంగా అలంకరించారు. ఆలయం సందర్శన నేపథ్యంలో ప్రధాని మోడీ, హిమాచల్ ప్రదేశ్లోని చంబా మహిళలు తయారు చేసిన దుస్తులను ధరించారు..గౌరీ కుండ్ నుంచి కేదార్నాథ్, గోవింద్ఘట్ నుంచి హేమకుండ్ సాహిబ్లను కలుపుతూ రెండు కొత్త రోప్వే ప్రాజెక్టును అందుబాటులోకి రానున్నాయి.3,400 కోట్లతో కేంద్ర ప్రభుత్వం కొత్త రోప్వే ప్రాజెక్టులను చేపడుతున్న నేపధ్యంలో ఇక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మోడీ పరిశీలించారు.అలాగే ఆదిగురువు శంకరాచార్యుల సమాధి స్థలాన్ని సందర్శించారు.కేదార్నాథ్లోని మందకి అస్తపథం, సరస్వతీ అస్తి పథాలను పరిశీలించారు.అనంతరం స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గౌరీకుండు నుంచి కేదార్నాథ్ 9.7 కిలోమీటర్ల రోప్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
This website uses cookies.