2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు అడుగిడాలి-ప్రధాని మోదీ
అమరావతి: 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని,,2040 నాటికి చంద్రుడి పైకి తొలి భారతీయుడిని పంపాలనే లక్ష్యాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శాస్త్రవేత్తలకు లక్ష్యంను నిర్దేశించారు.. మంగళవారం భారతదేశ గగన్ యాన్ మిషన్ ప్రగతిని ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో ప్రధాని సమీక్షించారు..కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజైషన్ (ఇస్రో) చైర్మన్ సి.సోమనాథ్, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు..ఈ సదర్బంలో ప్రదాని మోదీ, వీనస్ ఆర్బిటర్ మిషన్, మార్స్ ల్యాండర్ తో కూడిన ఇంటర్ ప్లానెటరీ మిషన్ల కోసం కృషి చేయాలని శాస్త్రవేత్తలను కోరారు.
హ్యూమన్ రేటెడ్ ప్రయోగ వాహనాలతో పాటు (HLVM3), 20 ప్రధాన పరీక్షల గురించి ఈ సమావేశంలో ప్రధాని చర్చించారు.. క్రూ ఎస్కేప్ సిస్టం టెస్ట్ వెహికల్ తొలి ప్రదర్శనను ఈనెల 21న షెడ్యూల్ చేయగా, 2025లో గగన్ యాన్ ప్రయోగం చేయాలని సమావేశంలో నిర్ణయించారు..చంద్రయాన్, ఆదిత్య-1 అంతరిక్ష ప్రయోగాలు విజయవంతమైన క్రమంలో భవిష్యత్తులో మరిన్ని ప్రతిష్ఠాత్మక లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని శాస్త్రవేత్తలకు ప్రధాని సూచించారు..
TV-D1 టెస్ట్ ఫ్లైట్ ఆక్టోబర్ 21వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య తిరుపతి జిల్లా పరిధిలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో దీనిని షెడ్యూల్ చేశారు..2024 సంవత్సరం చివర్లో మానవ అంతరిక్షయానంలో భారతీయ వ్యోమగాములను ఉంచడానికి షెడ్యూల్ చేసిన సిబ్బంది మాడ్యూల్ ను పరీక్షించడానికి ఇది సహాయపడుతుందని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ పేర్కొన్నారు.