బీజెపీలో చేరిన జయసుధ,క్రైస్తవుల గొంతు వినిపిస్తూనే ఉంటా..
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ బుధవారం కాషాయ తీర్దం పుచ్చుకున్నారు..ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి,బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్,బీజెపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సమక్షంలో జయసుధ బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు.. అంతకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సినీ నటి జయసుధ సమావేశమయ్యారు..పార్టీలో చేరడంతో పాటు పలు అంశాలపై చర్చించారు..అన్ని వర్గాలకు బీజేపీ అండగా ఉంటుందని జయసుధకు అమిత్ షా చెప్పినట్లు సమాచారం..పార్టీలోకి జయసుధ రావడం సంతోషంగా ఉందని, అమెకు స్వాగతం పలుకుతున్నానని తరుణ్ చుగ్ తెలిపారు.. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందిందని,, బీజేపీలో చేరాలని సంవత్సరం నుంచి అనుకుంటున్నానని ఆమె తెలిపారు..మతం, కులం పరంగా కాకుండా ప్రజలకు సేవ చేయాలని బీజేపీలో చేరానని జయసుధ చెప్పారు. క్రైస్తవుల గొంతు వినిపిస్తూనే ఉంటా.” అని బీజేపీ నాయకురాలు జయసుధ అన్నారు.