AMARAVATHISPORTS

జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికే సి.ఎం.కప్ క్రీడలు-మంత్రి రోజా

తిరుపతి: తిరుమల శ్రీవారి పాదాల చెంత క్రీడలు నిర్వహించడం ఎంతో సంతోషం వుందని క్రీడా శాఖ మంత్రిరోజా అన్నారు.. సోమవారం తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో 2023 ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ 2023 ను డిక్లరేషన్ తో ప్రారంభించిన సందర్బంలో అమె మాట్లాడుతూ మనం క్రీడలలో పాల్గొనడం గెలిచేందుకు పోటీ పడాలని, మెడల్ సాధించలేక పోయినా నిరాశ చెందాల్సిన పనిలేదన్నారు..రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, సహకారం అందిస్తుందని, వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులుగా ఎదిగేందుకు తోడ్పాటు ఉంటుందన్నారు..ఏ.పి సి.ఎం కప్ టోర్నమెంట్‌ను 1 మే 2023 నుండి 05 మే వరకు తిరుపతిలో పురుషులు, మహిళల కోసం 14 విభాగాలలో నిర్వహిస్తున్న నేపథ్యంలో మంత్రి రోజా,శ్యాప్ చైర్మన్ సిద్ధార్థరెడ్డి, ప్రధాన కార్యదర్శి, యువజన సర్వీసులు శ్రీమతి వాణీ మోహన్, జిల్లా కలెక్టర్ వెంకట రమణరెడ్డి,శ్యాప్ విసి అండ్ ఎండీ హర్ష వర్ధన్, శ్యాప్ డైరెక్టర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి రాష్ట్ర స్థాయి సిఎం కప్ పోటీలను ఘనంగా ప్రారంభించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *