ఓటర్ ఐడి కార్డులు పంపిణీ పూర్తి చేయాలి-కలెక్టర్
నెల్లూరు: ఓటర్ ఐడీ కార్డుల పంపిణీ వేంగగా పూర్తి చేయాలని కలెక్టర్ హరినారాయణన్ అధికారులకు సూచించారు. ఓటర్లు జాబితాలో పేరు ఉండి ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక గుర్తింపు కార్డు ఉంటే ఓటు వేయవచ్చని అన్నారు. మంగళవారం ఎన్నికల కంట్రోల్ రూమ్ లో నోడల్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన 18 చెక్ పోస్టులతో పాటు నెల్లూరు నగరంలోని ముఖ్య ప్రాంతాలలో తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఎఫ్ ఎస్ టి ,ఎస్ ఎస్ టి టీములు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమంగా తరలిస్తున్న వాటిని సీజ్ చేయాలన్నారు.కంటైనర్లు, గూడ్స్ వాహనాలు,లారీలు , బస్ లు,ఆటోలు ద్వి చక్ర వాహనాలు,ప్రతి వాహనాన్ని క్షున్నంగా తనిఖీ చేయాలన్నారు.మద్యం ,నగదు అక్రమంగా రవాణా జరగ కుండా పటిష్టం గా తనిఖీలు చెపట్టా లన్నారు. expenditure అధికారులు, రిటర్నింగ్ అధికారులు సీజర్లపై దృష్టి పెట్టాలన్నారు.