అమరావతి: గుజరాత్ లో ఓ కెమికల్ ఇంజినీర్ వద్ద రూ.500 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ముడి సరకులు పట్టు బడ్డాయి.. గుజరాత్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు…మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ కు చెందిన జితేష్ హిన్హోరియా గుజరాత్ లోని సూరత్ లో నివసిస్తున్నాడు..ఇతను మాజీ ఫార్మా ఉద్యోగి కావడంతో ప్రస్తుతం కెమికల్ ఇంజినీర్ గా స్వంతగా పనిచేస్తున్నాడు..జితేష్ కెటామైన్, మెఫెడ్రోన్, కొకైన్ లను ఉపయోగించి డ్రగ్స్ తయారు చేస్తున్నాడని పోలీసులకు పక్కా సమాచారం అందింది..వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతని నివాసంపై దాడులు చేశారు.. ఈ దాడుల్లో డ్రగ్స్ తయారు చేయడానికి అవసరం అయ్యే 23 వేల లీటర్ల ముడిసరకు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు..దిని విలువ దాదాపు రూ.500 కోట్లని వారు ప్రాథమికంగా అంచనా వేశారు.. ముడిసరకును స్వాధీనం చేసుకున్న పోలీసులు,, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు..అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి డ్రగ్స్ తయారు చేసి భారత్ లోని వివిధ నగరాలు, పట్టణాలకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు..ఓ ఇండస్ట్రీ నుంచి వీరికి సరకు సప్లై చేస్తున్నట్లు తెలిసిందని,, పట్టుబడిన ముడిసరుకులో 14 కిలోల మెఫెడ్రోన్, 4.3 కిలోల కెటామైన్ ఉన్నాయి.. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు..మరో ఇద్దరు నిందితుల నివాసాల్లో సోదాలు చేయగా వారి వద్ద 23 కిలోల కొకైన్, 2.9 కిలోల మెఫెడ్రోన్, రూ. 30 లక్షల నగదు స్వాధీనం లభ్యమైందన్నారు..జితేష్ గత రెండు సంవత్సరాలుగా ముంబయి, ఇండోర్, ఢిల్లీ, చెన్నై, సూరత్ లలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా చేసేవాడని దర్యాప్తులో తేలియవచ్చిందన్నారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.