AMARAVATHICRIME

గుజరాత్ లో కెమికల్ ఇంజినీర్ వద్ద పట్టు బడిన రూ.500 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ముడి సరకులు

అమరావతి: గుజరాత్ లో ఓ కెమికల్ ఇంజినీర్ వద్ద రూ.500 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ముడి సరకులు పట్టు బడ్డాయి.. గుజరాత్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు…మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ కు చెందిన జితేష్ హిన్హోరియా గుజరాత్ లోని సూరత్ లో నివసిస్తున్నాడు..ఇతను మాజీ ఫార్మా ఉద్యోగి కావడంతో ప్రస్తుతం కెమికల్ ఇంజినీర్ గా స్వంతగా పనిచేస్తున్నాడు..జితేష్ కెటామైన్, మెఫెడ్రోన్, కొకైన్ లను ఉపయోగించి డ్రగ్స్ తయారు చేస్తున్నాడని పోలీసులకు పక్కా సమాచారం అందింది..వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతని నివాసంపై దాడులు చేశారు.. ఈ దాడుల్లో డ్రగ్స్ తయారు చేయడానికి అవసరం అయ్యే 23 వేల లీటర్ల ముడిసరకు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు..దిని విలువ దాదాపు రూ.500 కోట్లని వారు ప్రాథమికంగా అంచనా వేశారు.. ముడిసరకును స్వాధీనం చేసుకున్న పోలీసులు,, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు..అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి డ్రగ్స్ తయారు చేసి భారత్ లోని వివిధ నగరాలు, పట్టణాలకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు..ఓ ఇండస్ట్రీ నుంచి వీరికి సరకు సప్లై చేస్తున్నట్లు తెలిసిందని,, పట్టుబడిన ముడిసరుకులో 14 కిలోల మెఫెడ్రోన్, 4.3 కిలోల కెటామైన్ ఉన్నాయి.. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు..మరో ఇద్దరు నిందితుల నివాసాల్లో సోదాలు చేయగా వారి వద్ద 23 కిలోల కొకైన్, 2.9 కిలోల మెఫెడ్రోన్, రూ. 30 లక్షల నగదు స్వాధీనం లభ్యమైందన్నారు..జితేష్ గత రెండు సంవత్సరాలుగా ముంబయి, ఇండోర్, ఢిల్లీ, చెన్నై, సూరత్ లలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా చేసేవాడని దర్యాప్తులో తేలియవచ్చిందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *