కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం కలెక్టరేట్లోని శంకరన్ వీసీ హాల్లో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్ ను జనరల్ అబ్జర్వర్స్ నితిన్ సింగ్ బదారియ, రామ్ కుమార్ గౌతమ్ సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ నిర్వహించారు.జిల్లావ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారుల కేటాయింపు, రిజర్వ్ సిబ్బందిని ఆన్లైన్ ద్వారా ర్యాండమైజేషన్ చేసి కేటాయించారు. వీరంతా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రంలో పోలింగ్ విధులు నిర్వహించనున్నారు.