అవసరమైనంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే- మోహన్ భగవత్
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ సంఘ్ పరివార్ తొలి నుంచి రాజ్యాంగం నిర్ధేశించిన అన్ని రిజర్వేషన్లకు మద్దుతగా నిలుస్తోందని స్పష్టం చేశారు..ఆరెస్సెస్ రిజర్వేషన్లకు అనుకూలమైనప్పటికి,,కొంత మంది పని కట్టుకుని సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలతో దుష్ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు..ఆరెస్సెస్ రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఓ వీడియోను కొందరు సర్క్యూలేట్ చేస్తున్నారని,, ఇది పూర్తిగా అవాస్తమని తోసిపుచ్చారు.. రాజ్యాంగం ప్రకారం అమల్లో ఉన్న రిజర్వేషన్లకు తామ ఏనాడు వ్యతిరేకంగా మాట్లాడలేదని మోహన్ భగవత్ పేర్కొన్నారు.. అవసరమైనంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.