ఏసీబీ వలలో కొండాపురం ఎస్సై ఖాజావలి అరెస్ట్-రూ.20 వేలు లంచం
నెల్లూరు: దొంగలు తెలివితేటలు చూపించి దొంగతనలు,,దొపిడిలు చేస్తుంటారు..ఇక్కడ పోలీసులు దొంగలను మించిపోయి,,లంచం డబ్బును నేరుగా కాకుండా పెట్రోల్ బంకులో వున్న మహిళ మధ్యవర్తితో వసూలు చేస్తున్న కొత్త కొణం ఇది… రూ.20 వేలు లంచం మొత్తాన్ని పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న ఓ మహిళ వద్ద కట్టమని ఎస్ఐ ఖాజావలి అతి తెలివితేటలు చూపించి అడ్డంగా బుక్ అయ్యారు..వివరాల్లోకి వెళ్లితే…కలిగిరి సర్కిల్ పరిధిలోని కొండపురంలో చిన్న హాజరత్తయ్యపైన SC,ST అట్రాసిటీ కేసు ఒకటి ,,హాజరత్తయ్య భార్య అయన పైన పెట్టిన గృహ హింస కేసు రెండవది కొండాపుర స్టేషన్ లో 2023లో నమోదు అయివున్నాయి..ఈ కేసుల్లో తన ప్రమేయం ఏమి లేదని అనవసరంగా ఇందులో తనను ఇరికించారని హాజరత్తయ్య తన స్నేహితుడి ద్వారా SI కలసిన సందర్బంలో తెలియచేశాడు..ఒక కేసు రాజీ చేస్తానని,,మరోక కేసు కొంతకాలం సాగతీస్తాని,,ఇందుకు రూ.20 వేలు లంచం ఇవ్వలని.,అ డబ్బు కూడా వూరిలో వున్న ఒక పెట్రోల్ బంకులో మహిళకు అందచేయాలని ఎస్ఐ ఖాజావలి కోరాడు..లంచం ఇవ్వడం ఇష్టం లేని హాజరత్తయ్య,,ఏసిబి అధికారులను సంప్రదించాడు..ఏసిబి అధికారులు వ్యుహాం ప్రకారం కథను నడిపించడంతో,,లంచం డబ్బు తీసుకుంటున్న మహిళలను ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.. ఎస్ఐ ఖాజావలిపై కేసు నమోదు చేసి,ఏసిబి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు ఇన్ చార్జీ DSP శ్రీనివాసులు మీడియా సమావేశంలో తెలిపారు.