జనసేన కార్యకర్తలకు అందుబాటులో జనసేనాని,మంగళగిరికి షిఫ్ట్..
అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీని పూర్తి స్థాయిలో సమాయుత్తం చేసేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు..రాష్ట్ర ప్రజలకు అన్ని వేళల అందుబాటులో వుండే విధంగా హైదరాబాద్ నుంచి పార్టీ కార్యక్రమాలను తాత్కలికంగా నిలిపివేసినట్లు సమాచారం..జనసేన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి మంగళగిరికి మార్చేశారు..కేంద్ర కార్యాలయం సిబ్బంది,, ఫైల్స్,,ఇతర విభాగాలు,,కంప్యూటర్ లు మంగళగిరి కార్యాలయంకు తీసుకుని వచ్చారు..ఇక నుంచి సినిమా షూటింగ్ ఉంటేనే హైదరాబాద్ కు వెళ్లనున్నట్లు తెలిసింది..
మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అవసరాలకు అనుగుణంగా ఇంటి నిర్మాణం జరిగింది.. సినిమాకు సంబంధించిన విషయాలను చర్చించేందుకు కూడా నిర్మాతలు,, దర్శకులు మంగళగిరి వస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి..ఆదివారం రాత్రి నుంచే జనసేనాని కార్యచరణలోకి దిగిపోయారు..గత రెండు రోజుల నుంచి పార్టీ సంస్థాగత వ్యవహారాలు, మూడో విడత వారాహి యాత్రపై పార్టీ నేతలతో చర్చలు నిర్వహించినట్లు సమాచారం.. తూర్పు, పశ్చిమ గోదావరి,శ్రీకాకుళం,,విజయనగరం తదితర జిల్లాల నేతలను జనసేనాని మంగళగిరికి పిలిపించి మాట్లాడుతున్నట్లు భోగట్టా..