జమ్మూకశ్మీర్కు ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులు సమర్ధనీమే-సుప్రీం
అమరావతి: జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశంపై సుప్రీం కోర్టు సోమవారం స్పష్టమైన తీర్పు వెలువరించింది..జమ్మూకశ్మీర్ కు ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులు ఇచ్చిన చెల్లుబాటవుతాయని,,తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించింది..ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం వాదనలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది..ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమే అని,, శాశ్వతం కాదని స్పష్టం చేసింది..ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు తమ నిర్ణయాన్ని ప్రకటించింది.. రాజ్యాంగ బద్ధంగానే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం జరిగిందని తెలిపింది.. రాజ్యాంగంలోని అన్ని అంశాలూ కశ్మీర్ కు వర్తిస్తాయని,,మిగిలిన రాష్ట్రాలు,, కేంద్ర పాలిత ప్రాంతాలతో జమ్మూకశ్మీర్ సమానమే అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది..ఆర్టికల్ 370 రద్దు వెనుక ఎటువంటి దురుద్దేశం కనిపించడం లేదని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.