మార్చి నుంచే 40 డిగ్రీలతో సూర్యుడి ప్రతాపం- విపత్తు నిర్వహణ సంస్
అమరావతి: ఈ వేసవిలో మార్చి నుంచే 40 డిగ్రీలతో సూర్యుడి ప్రతాపం తారాస్థాయిలో వుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఎం.డి కూర్మనాద్ తెలిపారు.. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత ప్రభావం చూపనున్నయన్నారు.. వేడిగాలులతో వడదెబ్బ బారిన పడే ప్రమాదం వుందని,, ఎండలపై సమాచారంకు టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 ఏర్పాటు చేయడం జరిగదిందన్నారు..వేసవి తీవ్ర గురించి సెల్ ఫోన్లకు వడగాల్పుల హెచ్చరిక సందేశాలు పంపిస్తామని వెల్లడించారు..కర్నూలు,,అనంతపురం,,సత్యసాయి,,కడప జిల్లాలో తీవ్రంగానూ,అల్లూరు,కోనసీమ,,విశాఖ,,ప్రకాశం,, నెల్లూరు,,విజయనగరం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఆవకాశం వుందని తెలిపారు..గత సంవత్సరం వేసవి కాలంలో గరిష్టంగా 48.6 డీగ్రిల అథ్యధిక ఉష్ణోగ్రత నమోదు అయిందని అయన వెల్లడించారు.