INTERNATIONAL

తైవాన్ లో అడుగుపెట్టిన అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసి

అమరావతి: చైనా హెచ్చరికలు బేఖాతర చేస్తు,,అమెరికా హౌజ్ (ప్రతినిధుల సభ) స్పీకర్ నాన్సీ పెలోసి మంగళవారం రాత్రి మలేసియా నుంచి విమానంలో తైవాన్ రాజధాని తైపీలొ అడుగు పెట్టారు..తైపీలోని గ్రాండ్ హయత్ హోటల్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు మధ్య ఆమె అక్కడే బస చేస్తున్నారు..పెలోసీ తైవాన్ పర్యటన నేపథ్యంలో అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి..తైవాన్ లో పెలోసీ పర్యటన ప్రారంభంకాగానే చైనా అధికారిక వార్తా సంస్థ స్పందిస్తు,, తైవాన్ పరిసర సముద్ర జలాల్లో చైనా సైన్యం ఆదివారం వరకు లైవ్ ఫైర్ డ్రిల్స్ చేపట్టనున్నట్లు ప్రకటించింది.. చైనా సైన్యం 21 విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపించింది..ఇదే సమయంలో పెలోసీ తైవాన్ పర్యటనను అమెరికా ప్రభుత్వం కాని ప్రతిపక్షపార్టీలు కాని ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు..దీంతో తైవాన్ విషయంలో తమ వైఖరిలో మార్పు లేదని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేసినట్లు అయింది..ఈ పరిణామం అమెరికా-చైనా మధ్య మరింత దూరం పెంచే ఆవకాశం కన్పిస్తుంది..పెలోసీ పర్యటనపై స్పందించేందుకు తైవాన్ విదేశాంగ శాఖ నిరాకరించింది..ఆమె పర్యటనపై తైవాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయలేదు..25ఏళ్ల తరువాత తైవాన్ ను సందర్శిస్తున్న అత్యున్నత అమెరికా ప్రతినిధి నాన్సీ పెలోసీ కావడం గమనించ తగ్గ ఆంశం..తైవాన్ లో అడుగు పెట్టిన తరువాత ఆమె పెలోసీ ఒక ప్రకటన విడుదల చేశారు.తైవాన్ లో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని అమెరికా ఆకాంక్షిస్తోందని, అందుకు తగిన సహాయంను కొనసాగించడాన్ని గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

3 hours ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

3 hours ago

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

23 hours ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

23 hours ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

2 days ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

2 days ago

This website uses cookies.