నెల్లూరు: నగరంలోని వివిధ ప్రాంతాల్లో సెబ్ అధికారులు దాడులు నిర్వహించి గంజాయిని అమ్ముతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి,62 కేజిల గంజాయి స్వాధీనం చేసుకొవడం జరిగిందని సెబ్ సూపరింటెండెంట్ రవికుమార్ చెప్పారు.మంగళవారం సెబ్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.