NATIONAL

సైన్యంకు ఆత్మనిర్భర భారత్ తో అధునిక ఆయుధాలు-ప్రధాని మోదీ

సైనిక కుటుంబ సభ్యులంతా..

అమరావతి: పాలన చేపట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,,తన సాంప్రదాయాన్ని నేడు కూడా కొనసాగించారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులతో కలిసి జరుపుకునేందుకు ప్రధాని మోదీ కార్గిల్ చేరుకున్నారు. కార్గిల్‌లోని సైనికులతో కలిసి ప్రధాని దీపావళి పండుగ సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ, దేశరక్షణలో సైన్యం సేవలు మరువలేనివని కొనియాడారు. దేశభక్తి దైవభక్తితో సమానమని తెలిపారు. సైనికుల వల్లే దేశంలో శాంతి, భద్రతలు నెలకొన్నాయని,,తమ ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని కాపాడుతున్నారని జవాన్లపై ప్రశంసలు ప్రధాని మోదీ కురిపించారు.సైనికుల వల్లే దేశ ప్రజలు సురక్షితంగా ఉన్నారని, ఆర్మీ బలగాలను చూస్తుంటే తనకు గర్వంగా ఉందన్నారు. సైనికులు దేశాన్ని కాపాడే రక్షణ స్తంభాలు అని ప్రధానమంత్రి అభివర్ణించారు. జవాన్లతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చింది’ అని చెప్పారు. సైనిక కుటుంబ సభ్యులంతా తన కుటుంబ సభ్యులేనని, వారి పిల్లల కోసం అనేక సైనిక స్కూల్స్‌ ప్రారంభించామని చెప్పారు. భారత్‌ దగ్గర ఉన్న స్వదేశీ ఆయుధాలు అత్యంత శక్తివంతమైనవి అని,, భారతదేశం ఎప్పుడూ యుద్ధం అనేది చివరి ప్రయత్నంగా చూస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.అనంతరం జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ స్వీట్లు పంచారు.

Spread the love
venkat seelam

Recent Posts

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

20 hours ago

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

21 hours ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

1 day ago

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురు కాల్పులు-7 మావోయిస్టులు హతం

అమరావతి: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు.. నారాయ‌ణ్‌పూర్‌, కాంకేర్…

1 day ago

ఎన్నికలు సజావుగా జరగేందుకు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలి-మిశ్రా

సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…

2 days ago

నియంత్రణ కోల్పోయిన అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌

అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ టేకాఫ్‌ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…

2 days ago

This website uses cookies.