జనసేనానితో సమావేశం అయిన అంబటి.రాయుడు
అమరావతి: మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో బుధవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సమావేశం అయ్యారు..అంబటి రాయుడు జనవరి 6వ తేదిన వైసీపీకి రాజీనామా చేశారు.. తన భవిష్యత్ కార్యాచరణ గురించి తరువాత ప్రకటిస్తానని రాయుడు తెలిపారు..పవన్ కల్యాణ్ తో సమావేశం కావడంతో జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయి?.. గుంటూరు లోక్ సభ నుంచి పోటీ చేయాలని అంబటి రాయుడు భావించారని ? ఈ విషయంపై వైసీపీ హైకమాండ్ నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో కేవలం పది రోజుల వ్యవధిలోనే పార్టీకి రాజీనామా చేశారు..