నెల్లూరు: ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4వ తేది వరకు జరుగబోవు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా చేసినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి కుర్మనాధ్ తెలిపారు.గురువారం జేసి చాంబర్ లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సన్నాహాక సమావేశం నిర్వహించారు. తోలుత ఇంటర్మీడియట్ పరీక్ష ఏర్పాట్ల పై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి టి.వరప్రసాద్ రావు వివరించారు.అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 52903 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారన్నారు. ఇందుకోసం జిల్లాలో 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అదేవిధంగా 4 ఫ్లయింగ్ స్కాడ్ లను, 5 సిటింగ్ స్కాడ్ లను ఏర్పాటు చేసామన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలోని అన్ని రూములలో సి సి కెమెరాలు ఏర్పాటు చేసామన్నారు. కంట్రోల్ రూమ్ నుండి పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. పరీక్షలు జరుగు ప్రదేశాల్లో నిరంతర విద్యుత్ సరఫరా కు చర్యలు తీసుకోవలసిందిగా విద్యుత్ శాఖాధికారులకు సూచించారు. అవసరమైన రూట్లలో ప్రత్యేకంగా RTC బస్ సర్వీసులు ఏర్పాటు చేయవలసిందిగా RTC అధికారులకు సూచించారు. ఈ వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
This website uses cookies.