నెల్లూరు: పెన్నా నదికి భవిష్యత్తులో ఎలాంటి వరద ముప్పు వాటిల్లినా నెల్లూరు నగర శివారు ప్రాంతాలైన వెంకటేశ్వరపురం, భగత్ సింగ్ కాలనీ ప్రజల ఇళ్లల్లోకి ఒక్క బొట్టు కూడా వరద నీరు రాకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు సుమారు 95 కోట్ల రూపాయలతో పెన్నానదికి కాంక్రీట్ రక్షణ గోడను పటిష్టంగా నిర్మించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అంబటి రాంబాబు చెప్పారు..బుధవారం నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో పెన్నా నది రక్షణ గోడ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్,కలెక్టర్ చక్రధర్ బాబుతో కలిసి మంత్రి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమి పూజ చేశారు..ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి శ్రీ అంబటి రాంబాబు మాట్లాడుతూ 2021 నవంబర్లో ఊహించని వరద ప్రవాహంతో భగత్ సింగ్ కాలనీ, వెంకటేశ్వరపురం ప్రాంతాలు నీట మునిగాయని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కాంక్రీట్ రక్షణ గోడ నిర్మాణానికి సీ.ఎం నిధులు మంజూరు చేశారని, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి మరో ఏడాదిలోగా కాంక్రీట్ రక్షణ గోడను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
నెల్లూరు: మూడు నెలల్లో...7 వేలను ఇళ్లను తిరిగి...ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నానని...వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని...మాజీ…
అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…
అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…
నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
This website uses cookies.