మేనిఫేస్టోలో కనీసం 10 శాతం చేసి చూపించా అని చెప్పుకోగలిగే ధైర్యం వుందా-జగన్
నెల్లూరు: చంద్రబాబు ఎన్నికలకు ముందు మాత్రమే మేనిఫెస్టో చూపిస్తాడు,,ఆ తర్వాత నాకైతే చూపించలేదు, కనీసం మీకైనా చూపించాడా, మేనిఫెస్టో కాపీ చూపించే దమ్ము, దైర్యం నీకు ఉందా? నువ్వు చెప్పిన నీ మేనిఫేస్టోలో కనీసం 10 శాతం చేసి చూపించా అని చెప్పుకోగలిగే ధైర్యం, నిబద్ధత ఉందా అంటూ వైసీపీ అదినేత జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు..శనివారం మేమంతా సిద్ధం కార్యక్రమంలో బాగంగా సీఎం జగన్ కాన్వాయ్ నేడు నెల్లూరు జిల్లాలోని కోవూరు, కావలి అసెంబ్లీ నియోజక వర్గాలకు చింతారెడ్డి పాలెం మార్గంలో వెళ్లారు.కావలిలో జరిగిన బహిరంగ సభలో అయన మాట్లాడారు.