నామినేషన్ల పర్వం ప్రారంభం
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల సమరానికి సిద్దమైన రాజకీయ పార్టీ అభ్యర్దుల వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల నుంచి నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారం ఉదయం నుంచి ప్రారంభం అయింది.కోవూరు నియోజకవర్గం (116) నుంచి ఢీ అంటే ఢీ అంటూన్న వైసీపీ అభ్యర్ది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి,,ఎన్డీయే అభ్యర్దిగా వేమిరెడ్డి.ప్రశాంతిరెడ్డిలు కోవూరులో నామినేషన్లను దాఖలు చేశారు.అలాగే కావలి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ది రామిరెడ్డి.ప్రతాప్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.