NATIONAL

జోషిమఠ్‌ ప్రాంతంలోవాటర్ లీకేజీ వల్ల ఇళ్లలో భారీ పగుళ్లు-మునిపిపాల్ చైర్మన్

అమరావతి: ఉత్తరాఖండ్‌లోని హిమాలయన్ టౌన్ జోషిమఠ్‌ ప్రాంతంలోని ఇళ్లకు పగుళ్లు వస్తూ, భూమి కుంగిపోతుండటంతో ఛమోలీ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.. జాతీయ వైపరీత్యాల నిరోధక బృందాన్ని (NDRF) తక్షణం రంగంలోకి దిగాలని శుక్రవారంనాడు ఆదేశించింది..దీంతో జిల్లా యంత్రాగం, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో కూడిన నిపుణుల బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఇంటింటి సర్వే చేపడుతోంది..గార్వాల్ కమిషనర్ సుశీల్ కుమార్, డిజాస్టర్ మేనేజిమెంట్ సెక్రటరీ రంజిత్ కుమార్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు..డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టం-2005 కింద హోటల్ వ్యూ, మలరి ఇన్‌లో పర్యాటకులను రాకపోకలను నియంత్రించారు..మార్వాడి వార్డులో గ్రౌండ్ నుంచి వాటర్ లీకేజీ వల్ల ఇళ్లలో భారీ పగుళ్లు వచ్చినట్టు జోషిమఠ్ మున్సిపల్ చైర్మన్ శైలేంద్ర పవార్ వెల్లడించారు.. కొండ చరియలు కారణంగా జోషిమఠంలో నిరాశ్రయులైన కుటుంబాలకు తాత్కలిక నివాసాలు ఏర్పాటు చేయాలని హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (HCC), నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC)లను ఛమోలీ జిల్లా యంత్రాగం కోరింది…జోషిమఠ్‌లో నెలకొన్ని పరిస్థితిపై అత్యున్నత స్థాయి సమావేశంలో చర్చిస్తున్నమని,,అధికారుల నుంచి నివేదిక అందగానే తగిన చర్యలు తీసుకుంటామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి శుక్రవారం భరోసా ఇచ్చారు..శనివారం తానే స్వయంగా జోషిమఠ్ వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నట్టు చెప్పారు..బీజేపీకి చెందిన ఒక బృందాన్ని కూడా జోషిమఠ్‌కు పంపుతున్నట్టు తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

51 mins ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 hours ago

స్పెషల్ డ్రైవ్ ద్వారా డ్రైను కాలువల పూడికతీత-MHO వెంకటరమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…

3 hours ago

కరెంట్, ఆర్టీసీ,ఇంటి పన్నులు పెంచిన జగన్ దేనికి సిద్దంగా వున్నాడు?-బాలకృష్ణ

అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…

18 hours ago

తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోంది-జెడీ.లక్ష్మీనారాయణ

అమరావతి: జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు, జేడీ వీవీ లక్ష్మీనారాయణ తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందని సంచలన…

20 hours ago

జాతీయ సంస్కృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి

తిరుపతి: సంస్కృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు శుక్రవారం సతీ సమేతంగా తిరుపతికి చేరుకున్న ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ ఖడ్ కు…

22 hours ago

This website uses cookies.