అమరావతి: భారత్ కు ప్రధాన సరిహద్దు శతృ దేశాలైన పాకిస్థాన్,, చైనాలు సరిహద్దుల్లో సమస్యలను సృష్టిస్తునే వున్నాయి..వీరిని ధీటుగా ఎదుర్కొవాలంటే అత్యధునిక ఆయుధ వ్యవస్థలు సరిహద్దుల్లో మోహరించాల్సి వుంటుంది.. ఇప్పటికే భారత్ అమ్ముల పొదిలో శక్తివంతమైన ఆయుధాలు వున్నప్పటికి,, వీటికి తోడుగా సాయుధ బలగాల కోసం 120 ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులను కొనుగోలు చేయాలని రక్షణ శాఖ అత్యున్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకొవడమే కాకుండా క్షిపణుల కొనుగోలుకు ఆమోద ముద్ర వేసింది..D.R.D.O సొంతంగా తయారుచేస్తున్న ఈ క్షిపణులు 100 కి.మీ.నుంచి 500 కి.మీటర్ల లక్ష్యాలను ఛేదించగలవని రక్షణ శాఖ వెల్లడించింది.ఈ క్షిపణులు సరిహద్దుల్లో ఉంటే ఇక భారత్ వైపు చైనా,,పాకిస్థాన్ లు ఇటువైపు చూడాలంటే వెనుకడుగు వేయాల్సిందేననే ధీమా వ్యక్తంచేస్తోంది రక్షణశాఖ..ప్రళయ్ క్షిపణులను ఛేధించటం అంత సులభం కాదని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి..2015 లో భారత రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ (D.R.D.O) ప్రళయ్ క్షిపణులను అభివృద్ధి చేసింది..ఈ క్షిపణులు సరిహద్దులను శత్రు దుర్భేద్యంగా మార్చివేస్తాయి..ప్రళయ్ క్షిపణులు పేరుకు తగినట్లుగానే ప్రళయాన్ని సృష్టించగలవు.. శత్రు దేశాలు ప్రయోగించిన క్షిపణులను కూల్చేసే సామర్థం ఈ ప్రళయ్ క్షిపణులు సొంతం.. అవసరాన్నిబట్టి గాలిలోనే దిశను మార్చుకోగలిగే సామర్థ్యం ఈ ప్రళయ్ క్షిపణులకు వుంటుంది..350 నుంచి 700 కీలోల పేలోడ్ ను ఇవి మోసుకుని పోగలవు.. DRDO మిస్సైల్ గైడెన్స్ వ్యవస్థతో పాటు అత్యాధునిక సాంకేతికతను జోడించి ఈ ప్రళయ్ క్షిపణులను తయారు చేసింది..2020లోనే ఈ క్షిపణులను పరీక్షించిన భారత్ ఆర్మీ వీటి ఫలితాలపై సంతృప్తిని వ్యక్తం చేసింది..క్షిపణుల మోహరింపు పూర్తి అయిన తరువాత చైనా, పాక్ లకు సరిహద్దుల్లో భారత్ ధీటైన జవాబు ఇస్తుంది..
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.