కాన్పూర్ లో ఘోర అగ్నిప్రమాదం-ఐదుగురు సజీవదహనం
అమరావతి: ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దేహాత్ ప్రాంతంలోని హర్మౌ బంజారాడేరా గ్రామంలో ఓ ఇంటిలో మంటలు చెలరేగడంతో ఐదుగురు సజీవదహనం అయ్యారు..మరణించిన వారిలో సతీష్(29) కాజల్(25) వారి ముగ్గురు చిన్నారులు ఉన్నారు..మార్చి 12వ తేదీ తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది..గుడిసెలో ఆకస్మికంగా మొదలైన మంటలు,,కాసేపటికే భారీ అగ్ని ప్రమాదానికి దారి తీశాయి. దీంతో గుడిసె అంతా మంటల్లో చిక్కుకుపోయింది..ఇంటి బయట నిద్రస్తున్న సతీష్ తల్లి తీవ్రంగా గాయపడింది..పరిస్థితి గమనించి స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది..అప్పటికే ఆ ఇంట్లో నిద్రపోతున్న ఐదుగురు వ్యక్తులు మంటల్లో కాలిపోయి మృతి చెందారని కాన్పూర్ ఎస్పీ మీడియా తెలిపారు..సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికి ఫలితం లేకపోయింది..పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని,,కేసు నమోదు చేసి,అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.