AMARAVATHICRIME

కాన్పూర్ లో ఘోర అగ్నిప్రమాదం-ఐదుగురు సజీవదహనం

అమరావతి: ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దేహాత్ ప్రాంతంలోని హర్మౌ బంజారాడేరా గ్రామంలో ఓ ఇంటిలో మంటలు చెలరేగడంతో ఐదుగురు సజీవదహనం అయ్యారు..మరణించిన వారిలో సతీష్(29) కాజల్(25) వారి ముగ్గురు చిన్నారులు ఉన్నారు..మార్చి 12వ తేదీ తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది..గుడిసెలో ఆకస్మికంగా మొదలైన మంటలు,,కాసేపటికే భారీ అగ్ని ప్రమాదానికి దారి తీశాయి. దీంతో గుడిసె అంతా మంటల్లో చిక్కుకుపోయింది..ఇంటి బయట నిద్రస్తున్న సతీష్ తల్లి తీవ్రంగా గాయపడింది..పరిస్థితి గమనించి స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది..అప్పటికే ఆ ఇంట్లో  నిద్రపోతున్న ఐదుగురు వ్యక్తులు మంటల్లో కాలిపోయి మృతి చెందారని కాన్పూర్ ఎస్పీ మీడియా తెలిపారు..సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికి ఫలితం లేకపోయింది..పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని,,కేసు నమోదు చేసి,అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *