భారత్ కు చేరుకున్నఉక్రెయిన్ మంత్రి జాపరోవా
అమరావతి: ఉక్రెయిన్ పై రష్యా సైనికి చర్యలు తీవ్రస్థాయికి తీసుకుని వెళ్లుతున్న సమయంలో ఉక్రెయిన్ విదేశాంగ శాఖ తొలి డిప్యూటీ మంత్రి ఎమిన్ జాపరోవా సోమవారం భారత దేశానికి చేరుకున్నారు..అమె న్యూఢిల్లీలో నాలుగు రోజుల పాటు పలువురు నేతలను కలుసుకోనున్నారు..భారత విదేశాంగ శాఖ ప్రతినిధి సంజయ్ వర్మతో, ఎమిన్ జాపరోవా చర్చలు జరపనున్నారు..సైనికి చర్యలు చోటుచేసుకున్న సమయంలో ఆమె భారత్ కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది..రష్యా,,ఉక్రెయిన్ ల మధ్య సైనిక చర్య,, భారత్-ఉక్రెయిన్ మధ్య సత్సంబంధాలు, అంతర్జాతీయ సమస్యలు వంటి అంశాలపై చర్చలు జరపనున్నట్లు సమాచారం.. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖితో కూడా ఎమిన్ జాపరోవా సమావేశంలో పాల్గొననున్నారు..
జాతీయ భద్రతా ఉప సలహాదారు విక్రమ్ మిస్రీతోనూ ఆమె సమావేశం కానున్నారు..ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మొట్టమొదటి డిప్యూటీ మంత్రి ఎమిన్ జాపరోవాకు భారత్ లోకి స్వాగతం పలికామని,, ఇరు దేశాల ధ్వైపాక్షిక సంబంధాలు, సహకారంపై చర్చించామని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి సంజయ్ వర్మ ట్విట్టర్ లో తెలిపారు..ఆమె పర్యటన విజయవంతం అవుతుందని ఆశిస్తున్నామని చెప్పారు..రష్యా-ఉక్రెయిన్ సైనిక చర్యలపై భారత్ ఇప్పటికే పలుసార్లు స్పందించింది..చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పలుసార్లు ఫోనులో సంభాషించారు.
Pleasure to receive Ukrainian Deputy FM @EmineDzheppar. Perspectives shared. Discussed bilateral engagements and cooperation going forward. Wishing her a good trip. Her first as DFM, but a country she is familiar with. @MEAIndia @IndiainUkraine @DrSJaishankar @IndianDiplomacy pic.twitter.com/7MmdWFKGR5
— Sanjay Verma (@SanjayVermalFS) April 10, 2023