అమరావతి: రైతులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది..కనీస మద్దతు ధర రైతులకు గిట్టుబాటు కల్పించడంతో పాటు, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టడడం జరిగిందని కేంద్ర మంత్రి పియూశ్ గోయల్ తెలిపారు..బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ 2023-24 మార్కెటింగ్ సీజన్ కు ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల పెంపునకు బుధవారం ఆమోదం తెలిపింది…సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్(CACP) సిఫారసుల ఆధారంగా వివిధ పంటల కనీస మద్ధతు ధరలను నిర్ణయిస్తామని వివరించారు.. ఈ ఖరీఫ్ సీజన్ లో వరి కనీస మద్ధతు ధరను క్వింటాల్ కు రూ.143 పెంచడంతో ప్రస్తుతం క్వింటాల్ వరి ధర రూ.2,183 కు చేరుకుంది..గతే సంవత్సరం ఇది రూ.2,040 గా ఉంది..పెసర్ల పంటకు అత్యధికంగా కనీస మద్దతు ధరను పెంచారు..ప్రస్తత పెంపుతో పెసర క్వింటాల్ కనీస మద్దతు ధర రూ.8,558 కి చేరింది..గత సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో ఇది రూ.7,755 గా ఉంది.. హైబ్రిడ్ జొన్న క్వింటాల్ రూ.3180, జొన్న(మాల్దండి), రూ.3225,, రాగి రూ.3846,, సజ్జలు రూ.2500,, మొక్కజొన్న రూ.2090,, పొద్దు తిరుగుడు(విత్తనాలు) రూ.6760,, వేరుశెనగ రూ.6377,, సోయాబీన్ (పసుపు పచ్చ) రూ.4600,, పత్తి(మధ్యస్థాయి పింజ) రూ.6620,, పత్తి (పొడవు పింజ) రూ.7020 చొప్పున ఈ సీజన్ లో ఇవ్వనున్నట్టు మంత్రి తెలిపారు..
నెల్లూరు: మూడు నెలల్లో...7 వేలను ఇళ్లను తిరిగి...ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నానని...వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని...మాజీ…
అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…
అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…
నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
This website uses cookies.