AMARAVATHIPOLITICS

మీ కళ్ళను రెడ్డిగారి పంచె సందులో ఏమైనా పెట్టుకున్నారా? జనసైనికులు..

కాపు ఉద్యమానికి మీరెందుకు రాలేదు? పవన్ కు ముద్రగడ లేఖ..
అమరావతి: గోదావరి జిల్లాల్లోని కాపు ఓట్లపై అన్ని పార్టీలు దృష్టి కేంద్రకరించడంతొ,,క్రమేపీ ఈ ప్రాంతంలో నాయకుల మధ్య విమర్శల వేడి పెరుగుతొంది..వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వానికి అడపదడప లేఖలు రాయడం మినహా కాపు నేత ముద్రగడ,,క్రీయాశీలంగా వ్యవహరించిన సందర్బలు లేవనే చెప్పాలి..ఈ నేపధ్యంలో నేడు మద్రగడ.పధ్మనాభం హఠాత్తుగా తెరముందుకు వచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర పేరుతో గోదావరి జిల్లాలో పర్యాటిస్తున్న సందర్బంలో ఘాటు విమర్శలు చేస్తు లేఖ రాయడంపై కాపుల మధ్య చర్చ మొదలైంది..ముద్రగడ ఇప్పటి వరకు కాపులకు చేసింది ఏమిటి ? పవన్ కళ్యాణ్ కాపులకు ఏం న్యాయం చేస్తాడు ? అన్న ఆంశం…
ముద్రగడ పద్మనాభం లేఖ సారంశం:- కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాన్ కు లేఖ రాశారు..ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలు…..నిజాన్ని నిర్భయంగా చెప్పాలని ఈ లేఖ రాస్తున్నాను అంటూ ముద్రగడ పేర్కొన్నారు… నేను కులాన్ని వాడుకుని రాజకీయంగా ఎదగలేదని… యువతను వాడుకుని పబ్బం గడుపుకోలేదు అని వ్యాఖ్యనించారు…కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి ఉద్యమం చేయలేదని… నేను వదిలేసిన కాపు ఉద్యమాన్ని చేపట్టి యువతకు రిజర్వేషన్ ఫలాలు మీరు ఎందుకు అందించలేదు ? అని ప్రశ్నించారు.
జనసేన సైనికుల లేఖ :- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను నిందిస్తూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు,, జనసేన సైనికులు ఓ పేద కాపు యువకుడి ఆవేదన అంటూ లేఖ వైరల్ చేస్తున్నారు. ‘‘ఈ లేఖ మీకు రాసినందుకు…మీకు కోపం రావాలన్నా రెడ్డి గారి పర్మిషన్ కావాలి కదండీ…ఆంధ్రప్రదేశ్ లో కాపులను విలన్లుగా చూపించి మీ పబ్బం గడుపుకున్నారు…కాపులకు రిజర్వేషన్ ఇవ్వను అని జగన్ చెప్పినా… మీరు ఆయనకు మద్దతు ఎందుకిచ్చారండీ ? కాపుల రిజర్వేషన్ అంశాన్ని జనసేన మేనిఫెస్టోలో పెట్టిన పవన్ కళ్యాణ్ మీకు శత్రువు ఎలా అయ్యారండీ ? కులాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్, తెలుగు దేశం ప్రభుత్వాలలో మంత్రి పదవులు చేపట్టి, ఇప్పుడు కులంతో సంబంధం లేనట్టు మాట్లాడతారు ఏంటండీ ? ప్రజారాజ్యం పార్టీకి ఎదురు నిలబడి ఓటమి చెందారండి మీరు…పవన్ కల్యాణ్ ధైర్యానికి, కమిట్మెంట్ కి సరితూగే వ్యక్తి మీరు కానే కాదు…ముద్రగడ గారూ. ప్రజల్లో ప్రేమను మేము రోజురోజుకూ పొందుతూ ఉంటే మీ కళ్ళను రెడ్డి గారి పంచె సందులో ఏమైనా పెట్టుకున్నారా? ప్రజలు మంత్రులను నిలదీయడం మీరు రెడ్డి గారి పంచె సందులో నుంచి మీ కళ్ళను తీసి బాహ్య ప్రపంచాన్ని చూస్తే తెలుస్తుంది అండి…మీ మోసాలను చూసి కాపు జాతి మొత్తం మేల్కున్నామండి…మీరు బీపీ ట్యాబ్లెట్ వేసుకుని పడుకోండి…మీ ఆరోగ్యానికి మంచిది. పొత్తుల విషయం ఇంకా తేలలేదండి…అందుకే ఆయన దారిలో ఆయన అధికార పక్షాన్ని ఎదిరిస్తూ వెళ్తున్నారండి…మీకు ఈ విషయం అర్థం కాకపోవడం అనేది రెడ్డి గారి పాలేరు గా దశాబ్దాల పాటు ఉండిపోవడమేనండి, వాళ్ళు ఏం చెబితే అది పాటించడమేనండి మీ బతుకంతా. మంత్రిగా మీరు ఘనకార్యాలు…మా పెద్దలు చెబుతూనే ఉంటారండీ…ఈ కుల ద్రోహి ముద్రగడని నమ్మకండి అని… ద్వారంపూడి మీకు గొప్పెమో…ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష ఇచ్చిన పవన్ కళ్యాణ్ కాలి గోటికి మీరు సరిరారు’’అని జన సైనికులు లేఖలో పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *