AMARAVATHISPORTS

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించింది..తెలుగుతేజం వెన్నం జ్యోతి సురేఖ సత్తా చాటడంతో భారత్ ఈ అరుదైన రికార్డును సాధించింది.. మిక్స్‌ డ్‌ డబుల్‌ ఈవెంట్,,మహిళా జట్టు గోల్డ్ మెడల్స్ నెగ్గడంలో ఈమె కీలక పాత్ర పోషించింది.. కాంపౌండ్‌ మిక్స్‌ డ్‌ టీమ్‌ విభాగంలో, సురేఖ-అభిషేక్‌ వర్మ జోడీ ఫైనల్‌లో 158-157 తేడాతో ఎస్తోనియా జట్టుపై విజయాన్ని నమోదు చేసింది..మహిళల జట్టు విభాగంలోనూ భారతీయ అమ్మాయిలు అద్భుత విజయం సాధించారు.. ఇటలీకి చెందిన మార్సెల్లా టినిలి, ఐరెనె ఫ్రాంచిని, ఎలీసా రోనెర్‌పై,, వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్నీత్ కౌర్‌తో కూడిన భారత జట్టు, 236-225 తేడాతో గెలుపొందారు.. ప్రత్యర్థి విలుకాళ్లకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా, మన అమ్మాయిలు గురి తప్పకుండా లక్ష్యంను చేధించడంతో ఈ విజయం సొంతం అయ్యింది..పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో అభిషేక్ వర్మ, ప్రియాన్ష్‌, ప్రథమేశ్‌తో కూడిన భారత జట్టు నెదర్లాండ్‌కు చెందిన మైక్‌ స్కాలోసెర్, సిల్ పటెర్, స్టెఫ్‌ విలిమ్స్ టీమ్‌పై 238-231 తేడాతో గెలుపొంది స్వర్ణంను కైవశం చేసుకున్నారు..దింతో మూడు విభాగాల్లో భారత్ మూడు స్వర్ణాలు గెలుచుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *