అభిమానికి హగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
అమరావతి: జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో గోదావరి జిల్లాల్లో నిర్వహిస్తున్న వారాహి రథయత్రలో కొన్ని ఆసక్తికమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి..తమ నాయకుడిని నేరుగా చూస్తున్న అభిమానుల ఆనందంకు హద్దేలేకుండా పోతుంది..ఈలాంటి సంఘటనే కాకినాడలో చోటు చేసుకుంది..సోమవారం కాకినాడ జిల్లా ఏటిమొగకు బోటులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లారు..మత్స్యకారులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు..మత్స్యకారుల ప్రాంతాలను పరిశీలించారు..ఆయన వెంట పలువురు స్థానిక జనసేన నాయకులు ఉన్నారు..మత్స్యకారుల సమస్యలను పవన్ కల్యాణ్ తెలుసుకున్నారు..పవన్ కల్యాణ్ ను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు..పవన్ కల్యాణ్ పడవలో ఉండగా ఆయన వద్దకు ఈత కొడుతూ వచ్చి బోటు ఎక్కిన ఓ అభిమానికి పవన్ కళ్యాణ్ హగ్ ఇచ్చాడు..దింతో అమితానందంతో ఆ అభిమాని పడవలో నుంచి నీళ్లలోకి వచ్చి దారినే ఈదుకుంటూ వెళ్లిపోయాడు.
ఎంతో అదృష్టం చేసుకొని వుండాలి అన్న నిన్ను తాకాలి అంటే • పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు బోటు ఎక్కిన మత్స్యకార యువకుడు.
బోటు ఎక్కి జనసేనాని పవన్ ను hug చేసుకున్నాడు…😍👌 #VarahiYatra @PawanKalyan @JanaSenaParty#kakinada #VarahiVijayaYatra pic.twitter.com/3yqVXmziEM— జన నేత్ర (@jananetra) June 19, 2023