AMARAVATHINATIONAL

సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్న ప్రధాని మోదీ

అమరావతిం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చా వద్ద సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు..ఆదివారం ఉదయం చైనా సరిహద్దుకు అనుకుని ఉన్న హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చా చేరుకుని,,సరిహద్దు భద్రతా బలగాలతో కలసి ప్రధాని దీపావళి వేడుకులు జరుపుకున్నారు..
‘‘మన ధైర్యమైన భద్రతా దళాలతో దీపావళి జరుపుకోవడానికి హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చా చేరుకున్నాను.’’ అని ట్వీట్ చేశారు.. దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులతో దీపావళి పండుగ జరుపుకోవడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సాయుధ దళాలతోనే దీపావళి పండుగను జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది.. ప్రతి దీపావళికి సైనికులు ఉండే మారుమూల ప్రదేశాలకు వెళ్లి, వారి త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపి, వారితో పండుగ జరపుకుంటున్నారు..
ప్రధాని మోదీ దీపావళి సందేశం:- దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ,, అందరూ అద్భుతమైన ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు..”ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు…ఈ ప్రత్యేక పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, అద్భుతమైన ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను” అని ఆయన పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *