15 విమానాశ్రయ ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉత్తర్ ప్రదేశ్లోని అజంగఢ్ జిల్లాలో మండూరి ఎయిర్ పోర్టు కాంప్లెక్స్ లో రూ.34,700 కోట్లతో 782 అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు,, శంకుస్థాపన చేశారు..ఇందులో 12 కొత్త టెర్మినల్ భవనాలతో సహా 15 విమానాశ్రయ ప్రాజెక్టులను ప్రారంభించారు.. ప్రధాని మోదీ ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులలో అజంగఢ్,,శ్రావస్తి,,మొరాదాబాద్,, చిత్రకూట్,,అలీఘర్ విమానాశ్రయాలు ఉన్నాయి..వీటితో పాటు చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం,, లక్నో కొత్త టెర్మినల్ ప్రారంభోత్సవం చేశారు.. అలాగే అజంగఢ్లోని మహారాజా సుహెల్దేవ్ స్టేట్ యూనివర్శిటీని కూడా ప్రారంభించారు..ఈ ప్రాజెక్టులలో విమానాశ్రయలతో పాటు రైలు,, రోడ్లు,,ఇతర ప్రాజెక్టులు కూడా ఉన్నాయి..ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.