వలంటీర్ల జీతం నెలకు రూ. 10 వేలకు పెంచుతాం- చంద్రబాబు
వృద్ధులకు 4000, దివ్యాంగులకు 6000 ఫించన్..
అమరావతి: ఉగాది పండగ వేళ రాష్ట్రంలోని వలంటీర్లకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గొప్ప బాహుమనం ప్రకటించారు..కూటమి అధికారంలోకి వస్తే, వలంటీర్ల జీతం నెలకు రూ. 10 వేలకు పెంచుతామని,,ప్రజలకు సేవ చేసే వలంటీర్లకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని స్పష్టం చేశారు.. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే, వలంటీర్లను తొలగిస్తామంటూ జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు..వారిని ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని,,వారినే కొనసాగిస్తామని తెలిపారు.. అంతే కాకుండా వాలంటీర్లల్లో చదువుకున్న వారికి అద్భుతమైన ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు..ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక వృద్ధులకు 4000, దివ్యాంగులకు 6000 ఫించన్ ఇస్తామని హామీ ఇచ్చారు..త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామని,, కూటమి మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్తే వైసీపీకి డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు..వైసీపీ సహజ వనరులను దోపిడీ చేసేసిందని ఆరోపించారు…