ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం అందచేసిన గ్రీస్ దేశ అధ్యక్షురాలు
అమరావతి: ప్రపంచ దేశాలు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వారి దేశాల్లో అందచేసే అత్యున్నత గౌరవ పురస్కలతో సత్కరిస్తున్న నేపధ్యంలో, గ్రీస్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి, గ్రీస్ దేశం అత్యున్నత పురస్కారం అందజేసింది..ఏథెన్స్ లో నగరంలో “గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్”ను ప్రధాని మోదీకి,గ్రీస్ దేశ అధ్యక్షురాలు సకెల్లారోపౌలౌ ప్రదానం చేశారు..అనంతరం అధ్యక్షురాలుతో సమావేశమైన ప్రధాని మోదీ చంద్రయాన్-3 విజయంపై మాట్లాడుతూ, ఇది కేవలం భారత్ విజయం కాదని,,యావత్తు మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు..చంద్రయాన్-3 సేకరించిన డేటా,, యావత్ మానవాళితో పాటు శాస్త్ర, సాంకేతిక రంగానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు..అలాగే గ్రీస్ ప్రధానమంత్రి కియాకోస్ మిత్సోకిస్ తో ఇరు దేశాలకు సంబంధించిన పలు రంగాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
A special welcome in Athens. 🇮🇳 🇬🇷 pic.twitter.com/XXIgRhCPa4
— Narendra Modi (@narendramodi) August 25, 2023