తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు-4 గంటల వరకు బయటకు రావద్దు
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి..ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల అధిక టెంపరేచర్ వద్ద నమోదు అవుతున్నాయి..శనివారం తెలంగాణలో 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు చేరుకుంటుండగా రామగుండంలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.. నిజామాబాద్ లో 40 డిగ్రీలు, హైదరాబాద్ లో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది..అలాగే ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో 43 డిగ్రీలు,, కర్నూలు 42, తిరుపతి 41, నెల్లూరు, విజయవాడలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది.. 2016 తర్వాత ఏప్రిల్ నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు..ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున,, అవసరమైతేనే బయటకు రావాలని,,వడదెబ్బ బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రెండు రోజులు వడగాలులు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు..
ఐఎండి సూచనల ప్రకారం రేపు 179 మండలాల్లో తీవ్రవడగాల్పులు,209 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది..ఎల్లుండి 44 మండలాల్లో తీవ్ర,193 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.