అమరావతి: స్వలింగ సంపర్కుల వివాహాన్ని ప్రత్యేక వివాహ చట్టం కింద చట్టబద్ధంగా గుర్తించాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన స్వలింగ సంపర్కుల జంట సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపధ్యంలో ఈ పిటిషన్పై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరి పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు LGBTQ+ పౌరులకు కూడా వర్తిస్తుందని, స్వలింగ సంపర్కులైన సుప్రియో చక్రవర్తి, అభయ్ డాంగ్ పిటిషన్లో పేర్కొన్నారు. సుప్రియో చక్రవర్తి , అభయ్ డాంగ్లు కలిసి 10 సంవత్సరాలుగా హైదరాబాద్లో నివసిస్తున్నారు. గత సంవత్సరం (2021) డిసెంబరు నెలలో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు , స్నేహితుల సమక్షంలో 9వ వార్షికోత్సవం జరుపుకున్నారు. LGBTQ+ కమ్యూనిటీ సభ్యులు తమకు నచ్చిన వ్యక్తిని విహహం చేసుకోవడానికి ప్రాథమిక హక్కులను అమలు చేయాలని సుప్రీం కోర్టును కోరారు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.LGBTQ+ కమ్యూనిటీ సభ్యులు ఇతర పౌరులతో పాటు సమాన హక్కులు కల్పించాలని కోరారు.ఈ జంట తరపున న్యాయవాదులు అరుంధతీ కట్టూ, తదితరులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నెల్లూరు: మూడు నెలల్లో...7 వేలను ఇళ్లను తిరిగి...ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నానని...వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని...మాజీ…
అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…
అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…
నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
This website uses cookies.