కొత్త క్రిమినల్ చట్టాల సంబంధించిన బిల్లును మూజువాణి ఓటులో అమోదించిన లోకసభ
అమరావతి: బ్రిటిష్ కాలంలో భారతదేశంలో అమలు పర్చిన చట్టాల స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన క్రిమినల్ చట్టాలకు సంబంధించిన బిల్లును బుధవారం లోక్ సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.. భారతీయ శిక్షాస్మృతి,, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్,, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లు ఉన్నాయి..వీటి స్థానంలో కేంద్రం కొత్తగా “భారతీయ న్యాయ సంహిత,, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత,, భారతీయ సాక్ష్య” బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన కొన్ని కొత్త సవరణలతో పాటు బిల్లును సభ ఆమోదించింది..సదరు బిల్లులపై బుధవారం లోక్ సభలో చర్చ జరిగింది.. బిల్లులపై చర్చ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ భారతీయ శిక్షాస్మృతి స్థానంలో కొత్తగా తీసుకువస్తున్న భారతీయ న్యాయ సంహిత శిక్ష కంటే న్యాయంపై దృష్టి పెడుతుందన్నారు.. ప్రతిపాదిత మూడు క్రిమినల్ చట్టాలు ప్రజలను వలసవాద మనస్తత్వం,, దాని చిహ్నాల నుంచి విముక్తం చేస్తాయన్నారు..