ప్రాచీన కాలం నుంచి యోగా అనే ప్రక్రియ భారత సంస్కృతిలో ఒక భాగం-ప్రధాన మంత్రి మోదీ
యోగా మనందరిని దగ్గర చేసింది..
అమరావతి: యోగా అంటేనే విశ్వజనీతమైన ఒక ప్రక్రియ,,యోగా ప్రకృతిని మానవుని మానసికంగా,,శరీరకంగా అనుసంధానం చేసే వేదిక అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యనించారు..బుధవారం అమెరికాలోని న్యూయార్క్ సీటి ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ, యోగా దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ నూయార్క్ సీటిలో యోగా డే జరపాలనే ప్రతిపాదకు అన్ని దేశాలు మద్దతునిచ్చాయన్నారు.. అలాగే 2023ని చిరుధాన్యాల ఏడాదిగా ప్రకటించాలని భారత్ ప్రతిపాదన, భారత ప్రతిపాదనను ప్రపంచమంతా ఆమోదించడం సంతోషకరమన్నారు..యోగా దినోత్సవం మనందరినీ మరింత దగ్గర చేసి మన ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు,,యోగా దినోత్సవంలో పాల్గొన్న అందరికి ధన్యవాదాలు తెలిపారు..