మెగా డాటర్ కొణిదెల.నిహారిక-జొన్నలగడ్డ చైతన్య అధికారికంగా విడిపోయారు!
హైదరాబాద్: నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ విడాకులపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.. మే 19వ తేదీన కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన నిహారిక దంపతులు మ్యూచువల్ గా విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది..మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికకు చైతన్య జొన్నలగడ్డతో 2020 డిసెంబర్ లో వివాహం జరిగింది..ఉదయ్ పూర్ వేదికగా వీళ్ల పెళ్లిని మెగా ఫ్యామిలీ అంగరంగ వైభవంగా జరిపించింది..ఆటు తరువాత కొద్దిరోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి..నేటితో వీరిద్దరి మధ్య విడాకుల ప్రక్రియ పూర్తయ్యిందని తెలుస్తోంది.. విచారణ పూర్తి చేసిన కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు తాజాగా మ్యుచువల్ డైవర్స్ మంజూరు చేసినట్లు సమాచారం.