తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల.రేవంత్ రెడ్డి గురువారం మధ్యహ్నం 1.21లకు ప్రమాణస్వీకారం చేశారు.. ఎల్బీ స్టేడియంలో కిక్కిరిసన జనసందోహం, అగ్రనేతల సమక్షంలో రేవంత్ తో ప్రమాణం గవర్నర్ తమిళిసై చేయించారు.. రేవంత్ ప్రమాణం స్వీకారం తర్వాత మరో 11 మంది మంత్రులతో గవర్నర్ తమిళిసై రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేయించారు.. సీఎంతోపాటు డిప్యూటీ సీఎంగా భట్టి, మంత్రులుగా కొండా సురేఖ, సీతక్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్, జూపల్లి, పొంగులేటి, తుమ్మల, రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ ప్రమాణం స్వీకారం చేశారు..రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి AICC అగ్రనేతలు సోనియా, రాహుల్ , ఖర్గే, ప్రియాంకతోపాటు కీలక నేత కేసీ వేణుగోపాల్, హిమాచల్ గవర్నర్ సుఖ్విందర్ సింగ్ హాజరయ్యారు..