AMARAVATHIEDUCATION JOBS

జాతీయ సంస్కృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి

తిరుపతి: సంస్కృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు శుక్రవారం సతీ సమేతంగా తిరుపతికి చేరుకున్న ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ ఖడ్ కు రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఘన స్వాగతం పలికారు.అనంతరం ఉపరాష్ట్రపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు శ్రీవారి దర్శనార్థం బయల్దేరి వెళ్లారు.ఈ సందర్బంలో భారత ఉప రాష్ట్రపతి మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సమేతంగా కలియుగ ప్రత్యక్షదైవాన్నిదర్శించుకోవటం ఆనందంగా ఉందని,,దేశ ప్రజలందరి ఆయురారోగ్యాలు, శాంతి సౌఖ్యాల కోసం స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. తిరుమల నుంచి మధ్యాహ్నం 1.00 గంటకు జాతీయ సంస్కృత యూనివర్సిటీ చేరుకుని మూడవ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి, విద్యార్థినీ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ప్రశంసా పత్రాలను అందచేశారు. తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని మధ్యాహ్నం 3.15 గం.లకు తిరుగు ప్రయాణం కాగా రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్,అధికారులు సాదర వీడ్కోలు పలికారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *