జనసేనాని పవన్ కళ్యాణ్ పై కేసులు నమోదుకు ప్రభుత్వం అనుమతి
అమరావతి: వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆయనపై కేసులు పెట్టడానికి వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. పరువు నష్టం 199/4 సెక్షన్ క్రింద జనసేనానిపై కేసుల నమోదుకు అనుమతిస్తూ, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది..గ్రామవార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ నుంచి ఈ ఆదేశాలు వచ్చాయి.. పవన్ చేసిన వ్యాఖ్యలపై వివిధ పత్రికలు, మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కేసులు నమోదు చేయాలని చెప్పింది.. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు పంపారు..ఆంధ్రప్రదేశ్ లో మహిళలు అదృశ్యమవుతున్నారని, వాలంటీర్లు డేటా సేకరిస్తున్నారని, అదంతా ఎవరికి చేరుతుందని ప్రశ్నించారు..వాలంటీర్ సురేశ్ ఇటీవల చేసిన ఫిర్యాదు మేరకు విజయవాడలోని కృష్ణలంక పోలీసులు సెక్షన్ 153, 153ఏ, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.