AMARAVATHIPOLITICS

చెట్లుపైన కోటి రూపాయల నోట్ల కట్టలు

అమరావతి: కర్ణాటకలో మే 10వ తేదిన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారంతో తలమునకలై ఉన్నాయి..ఓటర్లను ఆకట్టుకోవటానికి పార్టీలు హామీలతో పాటు కాసులు కరుపించేందుకు సిద్దమైనట్లు కన్పిస్తొంది..ఈ నేపథ్యంలో మైసూరులోని పుత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిగా అశోక్ కుమార్ రాయ్ పోటీ చేస్తున్నాడు..ఐటీ,,ఈసీ అధికారులకు విశ్వనీయమైన సమాచారం అందడంతో అశోక్ కుమార్ రాయ్  సోదరుడు సుబ్రమణ్య రాయ్ ఇంట్లో సోదాలు చేపట్టారు..అతని ఇంటి పెరటిలోని చెట్టుపై గొతంలో దాచిన డబ్బుల కట్టలని అధికారులు కనిపెట్టారు..గొతం విప్పిచూడగా కోటి రూపాయల నోట్ల కట్టలు కనిపించాయి..అధికారులు ఈ మొత్తంను సీజ్ చేశారు.. ఓటర్లకు పంచటానికి డబ్బు దాచి పెట్టినట్లు సమాచారం..ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.300 కోట్లకు పైగా లెక్క చూపని డబ్బును అధికారులు సీజ్ చేశారు..బెంగళూరులోనే రూ.82 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు..మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *