సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి విచారణలు లైవ్లో ప్రసారం
అమరావతి: భారతదేశ చరిత్రలో సుప్రీంకోర్టుకు సంబంధించి తొలిసారి విచారణలు లైవ్లో ప్రసారం చేశారు..అయితే శుక్రవారం లైవ్ స్ట్రీమింగ్ను కేవలం సీజేఐ ఎన్వీ రమణ వీడ్కోలుతో పాటు తదుపరి సీజే ఉన్న ధర్మాసనం విచారణను ప్రత్యక్ష ప్రసారం చేశారు..సీజేఐగా ఎన్వీ రమణ శుక్రవారం పదవీ విరమణ చేశారు.జస్టిస్ యూయూ లలిత్ 49వ సీజేగా విధులు నిర్వర్తించనున్నారు.ఎన్ఐసీ వెబ్ పోర్టల్లో ఈ కార్యక్రమాన్ని లైవ్ చేశారు.రాజ్యాంగపరంగా కీలకమైన కేసులకు సంబంధించిన విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు గతంలో త్రిసభ్య ధర్మాసనం అనుమతి ఇచ్చింది. 2018, సెప్టెంబర్ 26వ తేదీన అప్పటి సీజే దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం సదరు తీర్పును వెలువరించింది..అయితే సీజేఐ రమణ పదవీ విరమణ చేసే లోపే లైవ్ ప్రసారాలను ప్రారంభించాలని గతంలో సుప్రీంకోర్టు తీర్మానించింది..కేసుల లైవ్ ప్రసారాల కోసం సుప్రీంకోర్టుకు చెందిన ఈ-కమిటీ ఇండిపెండెంట్ ఫ్లాట్ఫామ్ను అభివృద్ది చేసింది.