AMARAVATHIINTERNATIONAL

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం ?

అమరావతి: భారతదేశంకు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయిన దావూద్ ఇబ్రహీం తీవ్ర ఆనారోగ్య సమస్యల కారణంగా కరాచీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం ?..శుక్రవారం దావూద్ కు అతని సన్నిహితులే విషప్రయోగం చేశారని,,దింతో దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్య సమస్యలతో పాకిస్థాన్ లోని కరాచీలోని ఓ ఆసుపత్రిలో అత్యంత గోప్యంగా చేరినట్లు సోమవారం ఉధయం నుంచి సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి.. దావూద్ చికిత్స పొందుతూన్న ఆసుపత్రిలో ఒక ఫ్లోర్ మొత్తం అతనికే కేటాయించినట్లు తెలుస్తొంది.. దావూద్ కుటుంబ సభ్యులు,,ఐఎస్ఐ లోని ఉన్నతధికారులు తప్ప మిగిలిన ఎవ్వరిని ఆసుపత్రి ఫ్లోర్ లోకి అనుమతించడం లేదని సమాచారం వుంది..దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగినట్లు వచ్చిన వార్తలు ఇంకా నిర్ధారణ కాలేదు,,
కూపీ లాగుతున్న ముంబయి పోలీసులు:- మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఆసుపత్రిలో చేరడంపై అతని బంధువులు అలీషా పార్కర్,, సాజిద్ వాగ్లే నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కరాచీలో ఉంటున్నాడని జనవరి నెలలో దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి వెల్లడించారు..భాతరదేశంకు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ తలపై 25 మిలియన్ డాలర్ల బహుమతిని కూడా ప్రకటించింది., దావూద్ ఇబ్రహీంను అప్పగించేలా పాకిస్తాన్ పై ఒత్తిడి తేవాలని అంతర్జాతీయ సమాజాన్ని భారత్ కోరింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *