పాఠశాలకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణలో పాఠశాలకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిచింది..1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు జరిగే సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది..ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10వ తేది నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా,వాటిని ఏప్రిల్ 12వ తేది నుంచి ప్రారంభిచాలని జీవో జారీ చేసింది.. ఏప్రిల్ 25వ తేది నుంచి జూన్ 11వ తేది వరకు దాదాపు 48 రోజులు పాటు పాఠశాలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.. జూన్ 12వ తేదిన స్కూళ్లు తిరిగి ప్రారంభం అవుతాయి..రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్న దృష్ట్యా మార్చి రెండో వారం నుంచి ఒంటి పూట బడులు నడపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది..10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 3వ తేది నుంచి 13వ తేది వరకు నిర్వహిస్తారు.